రాజస్థాన్‌లో మరో 18 కరోనా కేసులు

రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ రోజు కొత్తగా 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 579కి చేరింది. వీరిలో 14 మంది కోటా ప్రాంతానికి చెందినవారు కాగా మిగిలిన నలుగురు బికనీర్‌కు చెందినవారు. బికనీర్‌కు చెందిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, ఆ కుటుంబంలో కరోనాతో ఇప్పటికే ఒక మహిళ మరణించింది. దేశంలో ఇప్పటివరకు 7,447 కేసులు నమోదుకాగా, 40 మంది మరణించారు.